బోనకల్లు, డిసెంబర్ 7 : విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ‘వందేమాతరం’ రైలు బుధవారం ైస్టెల్గా దూసుకెళ్లింది. త్వరలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య వందేమాతరం రైలును రైల్వేశాఖ నడిపించనున్నది. దీనిలో భాగంగా బుధవారం విజయవాడ- సికింద్రాబాద్ మధ్య ట్రైల్ రన్ నిర్వహించారు.
ఈ రైలు అతివేగంగా ట్రాక్పై దూసుకెళ్తుండడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించి రైలు ఫొటోలు, వీడియోలను తమ మొబైల్లో చిత్రీకరించారు. పై చిత్రాన్ని బోనకల్లు మండలం గోవిందాపురం-ఏ గ్రామం వద్ద ‘నమస్తే’ క్లిక్ మనిపించింది.