ఖమ్మం : ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో బుధవారం ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. యంబీసీ కమిటీ ఆధ్వర్యంలో వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్ ఖమ్మం నగర ఉపాధ్యక్షులు జక్కుల లక్ష్మయ్య ,ఎంబీసీ నాయకురాలు షేక్ షకీనా మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆర్జేసి కృష్ణల సహకారంతో వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వాల్మీకి మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు.
బీసీలకు ఆత్మగైరవ భవనాలు, వారి పిల్లల కోసం గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మంత్రి పువ్వాడ కృషితో ఖమ్మంలో 2 కోట్లతో బిసీ భవనాన్ని నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, మైనార్టీ అధ్యక్షులు యండీ ఝమిషుద్దీన్, 35వ డివిజన్ ఇన్ఛార్జి బోజెడ్ల రాంమ్మోహన్రావు, సాధీఖానా డైరెక్టర్ సలీం అహ్మద్, ఆల్లభక్షి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.