కారేపల్లి, జనవరి 6: దేశంలోని రాష్ర్టాలన్నీ తెలంగాణ నమూనా అభివృద్ధిని కోరుకుంటున్నాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అవతరించిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి దేశానికే రోల్మోడల్గా నిలుస్తోందని అన్నారు. మండల కేంద్రంలోని వైఎస్ఎన్ గార్డెన్లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ అభివృద్ధిని గమనించిన దేశ ప్రజలందరూ సీఎం కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. బీజేపీ పాలనలో సామాన్య ప్రజలు మరింత పేదరికంలోకి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మాలోత్ శకుంతల, రావూరి శ్రీనివాసరావు, పెద్దబోయిన ఉమాశంకర్, ఇస్లావత్ బన్సీలాల్, ముత్యాల సత్యనారాయణ, తోటకూరి పిచ్చయ్య, దుగ్గినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
తొలుత పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే.. పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. సమావేశం అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.