కొత్తగూడెం టౌన్, మార్చి 27 : కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్ది రవిచంద్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేఆర్ సురేశ్రెడ్డితో కలిసి ఢిల్లీలో శుక్రవారం రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు వినతిపత్రం అందజేశారు.
జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో భద్రాచలం రోడ్(కొత్తగూడెం) రైల్వే స్టేషన్ ఏర్పడి వందేళ్లకు చేరువవుతోంది. ఈ క్రమంలో దాని చారిత్రక నేపథ్యాన్ని కొనసాగిస్తూ కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ నెలకొల్పాలని వినతిలో కోరారు.