కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 3: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా టేకులగూడెం సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్పై గత నెల 30న మావోయిస్టులు మెరుపు దాడి చేసి ముగ్గురు జవాన్లను బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో ఇద్దరు మావోయిస్టులూ మృతిచెందినట్లు శనివారం మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో సమత పేరుతో లేఖ విడుదలైంది. మృతిచెందిన ఇద్దరిలో ఒకరు మహిళా మావోయిస్టు అని లేఖలో పేర్కొన్నారు.
మృతిచెందిన మహిళా మావోయిస్టు పేరు మాండవి మంగా అలియాస్ రాజే అని, ఈమె మావోయిస్టు పార్టీలో కంపెనీ-2కి చెందిన సెక్షన్ కమాండర్ పని చేసిందని లేఖలో ఉన్నది. అలాగే మృతుల్లో మరొకరు మాండవి బొజ్జ అని, ఈయన బెటాలియన్-1కి చెందిన పార్టీ సభ్యుడు అని లేఖలో ఉన్నది.