ఖమ్మం సిటీ/ రఘునాథపాలెం, డిసెంబర్ 28 : రోడ్డు ప్రమాదంలో గాయపడి నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టుకు జిల్లా టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) అండగా నిలిచింది. ఓ పత్రికలో రఘునాథపాలెం మండలం విలేకరిగా పనిచేస్తున్న పాశం వెంకటేశ్వర్లు కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికులు గమనించి అతడిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు.
విషయం తెలుసుకున్న టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ సారథ్యంలోని బృందం బుధవారం ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుడిని పరామర్శించింది. తక్షణ సాయంగా అతడి కుటుంబానికి రూ.10 వేలు అందించారు. వైద్యులతో మాట్లాడి సర్జరీ పూర్తయిన విలేకరిని ఇంటికి తీసుకెళ్లారు. ఆ క్రమంలో అతడి ఇల్లు.. భవనం పైభాగంలో ఉన్నందున టీయూడబ్ల్యూజే బృందం క్షతగాత్రుడిని మోసుకుంటూ ఇంట్లోకి చేర్చారు. యూనియన్ బాధ్యులు ఆదినారాయణ, చిర్రా రవి, వెన్నబోయిన సాంబశివరావు, ఉత్కంఠం శ్రీను, పేరబోయిన తిరుపతిరావు, జగదీశ్, రమేశ్బాబు, కొరకొప్పుల రాంబాబు, గోపి, రామకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.