చండ్రుగొండ: యువకులు రాజకీయాల్లో రాణించాలని ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు సూచించారు. బుధవారం ఖమ్మంలోని ఆయన స్వగృహంలో మద్దుకూరు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ యువజన నాయకుడు శ్రావణ్ మర్యాదపూర్వకంగా నామాను కలిశారు. ఈ సందర్బంగా శ్రావణ్కు ఎంపి నామా కొద్దిసేపు ముచ్చటించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది,సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత యువజన నాయకులపై ఉంటుందన్నారు.