ఖమ్మం :టిఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ నెల 25వ తేదీన హైద్రాబాద్ నగరంలో జరుగబోయే టీఆర్ఎస్ ప్లీనరికి ఆహ్వానం ఉన్న ప్రతి కార్యకర్త, ప్రజా ప్రతినిధులు కదలిరావాలని నగర మేయర్ పునుకొల్లు నీరజ పిలుపిచ్చారు. గురువారం ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన పార్టీ నగర కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు కార్పొరేటర్లు, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు, ప్రజా ప్రతినిధులు ప్లీనరికి హాజరుకావాలన్నారు. నిర్ధేశించిన సమయంలోగా ఖమ్మం నగరానికి చెందిన నాయకులు,ప్రజా ప్రతినిధులు ప్లీనరి ప్రాంగణానికి చేరుకోవాలని వారు సూచించారు. అదేవిధంగా వచ్చే నెల 15న వరంగల్లో జరిగే తెలంగాణ మహాగర్జన సభకు సంబంధించి ఈ నెల 27వ తేదీన జరిగే సన్మాహక సమావేశంలో ప్రతి ఒక్కరు హాజరు కావాలని ఆమె పిలుపినిచ్చారు.
వరంగల్లో జరిగే సభకు ఖమ్మం నగరంలోని అన్ని డివిజన్లలో గల పార్టీ సభ్యులు, డివిజన్ కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీల సభ్యులు , మహిళా ప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్యాలయ ఇన్ఛార్జి ఆర్జేసి కృష్ణ పార్టీ నాయకులు మడూరి సైదారావు, యువజన విభాగం అధ్యక్షులు దేవభక్తిని కిషోర్బాబు, ఎస్సీ విభాగం అధ్యక్షులు తొగరు భాస్కర్రావు,ఎస్టీ విభాగం అధ్యక్షులు వాంకుడోత్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.