ఏన్కూరు: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా సోమవారం ఏన్కూరు ప్రధాన సెంటర్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా వచ్చి రోడ్డుపై పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాణోతు సురేష్నాయక్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మేడా ధర్మారావు, మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ లాలునాయక్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఇస్నేపల్లి నాగేశ్వరరావు, నాయకులు కట్ట సత్యనారాయణ, గిద్దగిరి సత్యనారాయణ, పూర్ణకంటి మైసారావు, షేక్ బాజీ, ఇటికాల రాజు, జెర్రిపోతుల సుందరం తదితరులు పాల్గొన్నారు.