ఖమ్మం:టీఎన్జీఓస్ హాస్టల్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.రుక్మారావు, ఎస్.నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. బుధవారం కలెక్టర్లోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ అప్జల్ హసన్, ఆర్విఎస్ సాగర్ల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష,కార్యదర్శులుతోపాటు అసోసియేట్ ప్రెసిడెంట్గా కె.వీరయ్య, ఉపాధ్యక్షులుగా కె.వీరభద్రరరావు, కె.వెంకటేశ్వరరావు, కె.మురహరి, యం.కోమలి, జాయింట్ సెక్రటరీగా షేక్ హసీనా,జి.స్వర్ణలత,బి.వసంత,ట్రెజరర్గా కె.తిరుపతిరావు,ఎండీ ఆశ,పి.మాధురి, తదితరులను ఎన్నుకున్నారు.
అంతకుముందు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అప్జల్ హసన్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల సాధనకు సమన్వయంతో పనిచేస్తూ హక్కులనుసాధించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు సుంచు వీరనారాయణ, నందగిరి శ్రీను,సామినేని రఘు,ఎండీ మజీద్ తదితరులు ఉన్నారు.