ఖమ్మం : టీఆర్ఎస్ నాయకులు 350 మంది అనాథలకు అన్నదానం చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ లో 350 మంది అనాథలకు అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, ముదిగొండ మండలం పిఎసిఎస్ చైర్మన్ తుపాకుల ఏడుకొండలస్వామి, పోలూరి రమేష్, గునిగంటి సురేష్, రవి కుమార్, అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావులు పాల్గొన్నారు..