సత్తుపల్లి, డిసెంబర్ 28 : మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన నిధులతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.26.94 కోట్ల మంజూరు చేయడంపై మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ భవన ప్రారంభానికి వచ్చిన మంత్రి కేటీఆర్ రూ.30 కోట్లు మున్సిపాలిటీ అభివృద్ధికి ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు గతంలో రూ.3 కోట్లు మంజూరు చేశారని, తిరిగి మంగళవారం రూ.27 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ నిధులతో అంబేద్కర్ ఆడిటోరియం, లైబ్రరీకి రూ.2.65 కోట్లు, గాంధీనగర్లో కమ్యూనిటీ హాల్కు రూ.30 లక్షలు, వివేకానంద సెంటర్ అభివృద్ధికి రూ.30 లక్షలు, దోబీఘాట్కు రూ.70 లక్షలు, ఫుట్పాత్, మెయిన్రోడ్ పనుల ఆధునీకరణకు రూ.85లక్షలు, విద్యుత్ దీపాల ఆధునీకరణకు రూ.కోటి, డంపింగ్యార్డుకు రూ.70 లక్షలు, సైడ్డ్రైన్ల నిర్మాణానికి రూ.3.19లక్షలు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.2కోట్లు, బీటీ రోడ్లకు రూ.1.50 కోట్లు, 23 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి రూ.8.75కోట్లు, షాదీఖానా నిర్మాణానికి రూ.2 కోట్లు, తామరచెరువు, వేశ్యకాంతల చెరువుల అభివృద్ధికి రూ.3కోట్లు అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయిస్తామని అన్నారు.
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ నిధులు మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు బుధవారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రఫీ, అంకమరాజు, నాయకులు అమరవరపు కృష్ణారావు, మందపాటి రవీంద్రారెడ్డి, కంటే అప్పారావు, గఫార్, మధు, ఆనందరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.