సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయం విద్యుద్దీపాలతో మిరుమిట్లు గొల్పుతున్నది. హెడ్డాఫీసు ముఖద్వారం, తెలంగాణ తల్లి పార్కులు ధగధగ మెరుస్తున్నాయి. కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చొరవతో సింగరేణి సంస్థ అద్భుత అభివృద్ధి సాధించింది. అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధిస్తూ లాభాలు, ఉత్పత్తిలో దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ క్రమంలో అధికారులు, కార్మికులు ఎంతో ఉత్సాహంగా సింగరేణి సంబురాల్లో మునిగితేలనున్నారు
– కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 22