చర్ల, జనవరి 7: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు డిమాండ్ చేశారు.
చర్లలో ఆదివారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం చర్లకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు ధనికొండ చిన్నారి తల్లి మృతిచెందిందని తెలుసుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.