ఖమ్మం:సెప్టెంబర్ 11న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీ. హరేకృష్ణ భూపతి కోరారు. శనివారం ఖమ్మం కోర్టు ప్రాంగణంలో జరిగిన సమన్వయ సమావేశంలో భాగంగా న్యాయమూర్తి మేజిస్ట్రేట్లు, పోలీసు అధికారులకు జాతీయ లోక్ అదాలత్ గురించి ఆదేశాలు జారీ చేశారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు, సివిల్, కుటుంబ తగాదాలు వంటి వాటిని ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.
లోక్ అదాలత్లో రాజీ పడితే కలిగే ప్రయోజనాలను కక్షిదారులకు వివరించి వారిని రాజీ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ నిమిత్తం సెప్టెంబర్ 1నుంచే ముందస్తు లోక్ అదాలత్లను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు వారియర్, న్యాయమూర్తులు, మహ్మాద్ అబ్దుల్ జావీద్ పాషా, ఎన్.అనితారెడ్డి, ఎం.ఉషశ్రీ, రుబినా ఫాతిమా, ఎన్.శాంతిసోని, పి.మౌనిక, ఎన్.హైమ, పూజిత తదితరులు పాల్గొన్నారు.