ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 29: జేఈఈ మెయిన్స్లో ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలు అత్యుత్తమ ర్యాంకులతో సత్తా చాటినట్లు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్స్-2 పరీక్షలను నిర్వహించారు. శనివారం విడుదలైన వీటి ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయస్థాయిలో సత్తా చాటారని పేర్కొన్నారు.
జేఈఈ మెయిన్స్లో రెజొనెన్స్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి ర్యాంకులు సాధించారని కళాశాల డైరెక్టర్లు రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్రావు తెలిపారు. కళాశాలకు చెందిన నిఖిల్ ఆలిండియా 5వ ర్యాంకు సాధించినట్లు చెప్పా రు. రాజేశ్-447, భార్గవి-517, సాయి అక్షయ్-1139, సచిన్-2278, ప్రవీణ్తేజ-2279, అభినయ్-2945, వాసు-2972, ముఖేశ్-3800, అశోక్కుమార్-4773 ర్యాంకులతో ప్రతిభ కనబర్చినట్లు వివరించారు. జేఈఈ మెయిన్స్లో 75 శాతం సక్సెస్ రేట్ సాధించినట్లు పేర్కొన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాళ్లు సతీష్, భాస్కర్రెడ్డి, శాంతి అభినందించారు.
శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిష్ఠాత్మక జేఈఈ మెయిన్స్లో ఆలిండియా ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. కళాశాలకు చెందిన బీ.నిషా గోపిక-16వ ర్యాంకు, హర్షవర్ధన్-70, సాయిబాలాజీ-78, మణిప్రకాశ్-79, ఇందురెడ్డి-104, భానుప్రసన్న-129, వివేక్వర్ధన్వర్మ-149, ఉపేంద్ర-258, పవన్కార్తీక్-275, జశ్వంత్సాయి-297, శివగుప్త-370, మదన్లాల్-431, జగదీశ్-496, వంశీ-556వ ర్యాంకులతో ప్రతిభ కనబర్చినట్లు వివరించార. వీటితోపాటు 99కిపైగా పర్సంటైల్తో 21 మంది, 98 పర్సంటైల్పైగా పర్సంటైల్తో 38 మంది, 97పైగా పర్సంటైల్తో 52 మంది, 90 పైగా పర్సంటైల్తో 108 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. 541 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ అర్హత సాధించినట్లు చెప్పారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ బీ.సాయిగీతిక, డీజీఎం చేతన్ మాధుర్, డీన్ వర్మ, ఏజీఎంలు చిట్టూరి బ్రహ్మం, ప్రకాశ్, గోపాలకృష్ణ, ప్రిన్సిపాళ్లు అభినందించారు.
జేఈఈ మెయిన్స్లో నారాయణ విద్యార్థులు మొదటి బ్యాచ్లోనే ఆలిండియా 36వ ర్యాంకు సాధించి ప్రతిభ చూపారని డీన్ వెంకటరెడ్డి, డీన్ పాటి మాధవరావు తెలిపారు. కళాశాలకు చెందిన జీ.సురేశ్-36, రాఘవేంద్ర-166, నిఖిల్ చౌదరి-2311, వినయ్-6801వ ర్యాంకులతో రాణించినట్లు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఏజీఎం సురేశ్, ప్రిన్సిపాల్ అభినందించారు.
జాతీయ స్థాయి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కృష్ణవేణి కళాశాల అత్యుత్తమ ర్యాంకులను కైవసం చేసుకున్నట్లు కళాశాల అధినేత యార్లగడ్డ వెంకటేశ్వరావు తెలిపారు. కళాశాలకు చెందిన అరవింద్-54వ ర్యాంక్, నేహశ్రీ-186, సుభాని-280, జనేషు-367, వెంకటసాయితేజ-472, పవన్-823, మనోజ్-897, రవిశంకర్-1201, కల్యాణ్-1357, కిరణ్-1535, బాబా-1596, సోనీ-1957, నిఖిలశ్రీ-2197, చంటి-2229, యశ్విత-2864వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్లు గొల్లపూడి జగదీశ్, మాచవరపు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాంచందర్రావు, డీన్ శేఖర్బాబు, అకడమిక్ ఇన్చార్జి వంశీకృష్ణ, ఏవో నిరంజన్ అభినందించారు.