కూసుమంచి, జనవరి 21: కేంద్రం దేశవ్యాప్తంగా 12 కొత్త రైల్వే ప్రాజెక్టులు చేపట్టింది. దీనిలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్- మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ వరకు రైల్వేలైన్ నిర్మించనున్నది. రైల్వేలైన్ బొగ్గు, సిమెంట్ వంటి వాణిజ్య వ్యాపార వస్తువుల రవాణాకు ఉపయోగపడనున్నది. ఈ రైల్వేలైన్ సూర్యాపేట జిల్లాకేంద్రంతో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం గుండా వెళ్లనున్నది.
రైల్వేలైన్ నిర్మాణంపై దక్షిణ మధ్య రైల్వే రెండు రోజుల నుంచి నియోజకవర్గంలో ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఏరియల్ సర్వే చేపడుతున్నది. ఈ సర్వే ఆదివారమూ కొనసాగింది. ఎయిర్క్రాఫ్ట్ అత్యంత కింద నుంచి ప్రయాణించడంతో నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సర్వేపై తదుపరి వివరాలు తెలియరావాల్సి ఉన్నది.