టేకులపల్లి, జనవరి 7: సింగరేణి ఇల్లెందు ఏరియా సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అధిగమించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఆదేశించారు. ఆదివారం ఆయన కోయగూడెం ఉపరితల గనిని సందర్శించి ఏరియా అధికారులు, సిబ్బందికి సూచనలిచ్చారు.
వ్యూపాయింట్ నుంచి క్వారీలో చేపడుతున్న ఓబీ తొలగింపు, బొగ్గు వెలికితీత పనులను పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణాపై ఏరియా జీఎం జాన్ ఆనంద్ను ఆరా తీశారు. పర్యటనలో సంస్థ డైరెక్టర్ (పీపీ) జి.వెంకటేశ్వర్రెడ్డి, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్వీకే శ్రీనివాస్, సేఫ్టీ జీఎం గురవయ్య, జీఎం సెక్యూరిటీ దీక్షితులు, ప్రాజెక్ ఆఫీసర్ ప్రహ్లాద్, డీజీఎం పర్సనల్ మోహన్రావు ఉన్నారు.