మణుగూరు టౌన్, డిసెంబర్ 25: యాదవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మండల యాదవ సంఘం వన భోజన మహోత్సవం, ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథి రేగా కాంతారావు మాట్లాడుతూ.. మణుగూరులో యాదవ కల్యాణ మండపానికి రూ.50లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
గొర్రెల పంపిణీ పథకానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి, సహకార సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ.. విద్య, ఐక్యతతోనే యాదవుల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సంఘం మండల అధ్యక్షుడు మార్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.