కారేపల్లి, ఏప్రిల్ 19: చీమలపాడు దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన వలస కూలీ సందీప్ భార్య మమత, కుమారుడు కృష్ణను బుధవారం పరామర్శించి నామా ట్రస్టు ద్వారా రూ.2లక్షలు, ఎమ్మెల్యే వ్యక్తిగతంగా రూ.2లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రాణాలు కోల్పోయిన చీమలపాడుకు చెందిన అజ్మీర మంగు భార్య లలితకు, గేట్ రేలకాయలపల్లికి చెందిన ధరంసోత్ లక్ష్మణ్ భార్య సరోజకు, స్టేషన్ చీమలపాడుకు చెందిన బానోత్ రమేశ్ భార్య జ్యోతిలకు నామా ట్రస్టు ద్వారా రూ.2లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే రాములునాయక్తోపాటు రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీ క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ కనకమేడల సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు.
ఎంపీ నామా నాగేశ్వరరావు పంపిన సందేశంలో తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, గాయపడి చికిత్స పొందుతున్న వారికి కూడా రూ.50వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాలోత్ శకుంతల, కారేపల్లి, వైరా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్, బాణాల వెంకటేశ్వర్లు, సర్పంచ్లు మాలోత్ కిశోర్, బానోత్ సక్రాం,బానోత్ కుమార్, ఎంపీటీసీ శంకర్, నాయకులు ముత్యాల సత్యనారాయణ, అజ్మీర వీరన్న, బత్తుల శ్రీనివాసరావు, తోటకూరి రాంబాబు, డేగల ఉపేందర్, మోరంపూడి ప్రసాద్, అడప పుల్లారావు, అడ్డగోడ ఐలయ్య, ఈదర కోటేశ్వరరావు, అరుణ్కుమార్, రాంకిశోర్, నామా సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు, కృష్ణప్రసాద్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.