నేలకొండపల్లి/ ఇల్లెందు రూరల్/ పెనుబల్లి, మార్చి 18: పే స్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేలకొండపల్లి, ఇల్లెందు మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2002 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న తమకు జీవో నెంబర్ 11 ప్రకారం పే స్కేల్ మంజూరు చేసినందుకు, క్రమబద్ధీకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు.
మంచి వేతనం అందించడంతో పాటు తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని అన్నారు. సహకరించిన మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ కవితలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. పెనుబల్లి మండలంలో పీడీ విద్యాచందన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.