సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : వాహన, డెలివరీ సంఘాల నాయకులు శనివారం చేపట్టనున్న నిరవధిక సమ్మె ఈ నెల 17కు వాయిదా వేసినట్టు జేఏసీ నాయకులు షేక్ సలావుద్దీన్, నగేశ్ తెలిపారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ ఆధ్వర్యంలో సెక్రటేరియెట్లో చర్చలు జరిగాయని, సామాజిక భద్రత, ఫేర్ ధరల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర యాప్ ఆధారిత సంస్థల అగ్రిగేటర్లతోను మంత్రి చర్చించారని పేర్కొన్నారు. కొంత సమయం ఇవ్వాలని మంత్రి సూచించినట్టు తెలిపారు. ఫేర్ ధరల పెంపుపై అగ్రిగేటర్లు పరిశీలించాలని ఆదేశాలిచ్చినట్టు వివరించారు.