మామిళ్లగూడెం, జనవరి 5 : ఖమ్మం నూతన పోలీస్ కమిషనర్గా సునీల్ దత్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సునీల్ దత్.. సీపీ విష్ణు ఎస్ వారియర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. 2014 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ దత్ ప్రస్తుతం హైదరాబాద్ సిటీ ఈస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)గా విధులు నిర్వర్తిస్తూ ఖమ్మం సీపీగా బదిలీ అయ్యారు. గతంలో భద్రాచలం ఏఎస్పీగా, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా పని చేశారు. 2022 జూలైలో హైదరాబాద్ డీసీపీగా బదిలీపై వెళ్లారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఖమ్మం పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు.