ఖమ్మం:ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలానికి సుడా నిధులు కేటాయించ నున్నట్లు సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పేర్కొన్నారు. మండల పరిధి కోయచలక, చిమ్మపూడి, పాపటపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా పంచాయితీల్లో పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. చిమ్మపూడి గ్రామంలో సైడ్ డ్రైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. కోయచలక, పాపటపల్లి గ్రామాల్లో పర్యటించి రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.
ఈ సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మాజీ వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, ఆత్మ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్గౌడ్, సర్పంచ్లు మాదంశెట్టి హరిప్రసాద్, గొర్రె కృష్ణవేణి, రైతుబంధు మండల కన్వినర్ దొంతు సత్యనారాయణ, టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అద్యక్షులు చెరుకూరి బిక్షమయ్య, షేక్ జానీ, ఉయ్యూరు వెంకట నారాయణ,యువజన విభాగం మండలాద్యక్షుడు విజయ్రెడ్డి, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.