కొనుగోలు కేంద్రంలో పత్తి నిల్వలు పేరుకుపోయాయి. చేసేది లేకపోవడంతో అధికారులు మూడు రోజులపాటు కొనుగోళ్లు నిలిపివేశారు. శుక్రవారం మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించడంతో మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ కొటెక్స్లో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద పత్తి లోడు వాహనాలు బారులు తీరాయి. సీసీఐ కొనుగోలు కేంద్రంలో ఎటువంటి మోసాలకు తావులేకుండా అధికారులు చర్యలు చేపట్టడం.. గిట్టుబాటు ధర కల్పిస్తుండడంతో రైతులు గంటల తరబడి వేచి ఉండి తమ పంట ఉత్పత్తులను అమ్ముకుంటున్నారు.