మామిళ్లగూడెం, జనవరి 23: సామాన్యుల సమస్యలను త్వరితగతిన పరిషరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. ప్రజలందరూ వచ్చిన తమ సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారమూ ప్రజావాణి నిర్వహిస్తోందని అన్నారు. ఇక్కడ దరఖాస్తు అందిస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకంతో ప్రజలందరూ వచ్చి అర్జీలు అందిస్తున్నారని అన్నారు. వీవీ పాలెంలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (ఐడీవోసీ) హాల్లో సోమవారం జరిగిన తొలి ప్రజావాణికి మంత్రి పువ్వాడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎవరికీ దకని అరుదైన గౌరవం మన ఖమ్మం జిల్లాకు దకడం చాలా గర్వంగా ఉందన్నారు. ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి నలుగురు ముఖ్యమంత్రులు హాజరుకావడం, వారంతా కలిసి మన కలెక్టర్ వీపీ గౌతమ్ని తన సీటులో కూర్చోబెట్టడం అద్భుతమైన గౌరవమని అన్నారు. అధికారులు కూడా అర్జీదారుల దరఖాస్తులను స్వీకరించి వారిని తమ బిడ్డల వలే భావించి సరైన న్యాయం చేయాలని సూచించారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి ఎలా తీసుకువెళ్లాలో తెలియక సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతుండేవారని అన్నారు.
అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసి పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని వివరించారు. దీంతో ప్రజలందరూ తమ సమస్యలను కలెక్టర్ సమక్షంలో ఒకే వేదిక దగ్గర జిల్లా అధికారులకు విన్నవిస్తున్నారని అన్నారు. ప్రజలకు సరైన పాలన అందించేందుకు ప్రజావాణి ఎంతో దోహదపడుతుందని అన్నారు. అన్ని కార్యాలయాలూ ఒకే సముదాయంలో ఉండడం వల్ల ప్రజల సమస్యలను ఒకే చోట పరిష్కారం లభిస్తుందని అన్నారు. ప్రజల సౌకర్యార్థం ఖమ్మం నగరం నుంచి నూతన కలెక్టరేట్ వరకు ఆర్టీసీ సిటీ బస్సులను నడుపుతామని పేరొన్నారు. అనంతరం నూతన కలెక్టరేట్ విధులు ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్కు, అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి ముందుగా కలెక్టరేట్ ఉద్యోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అదనపు కలెక్టర్లు మధుసూదన్, స్నేహలత మొగిలి, డీఆర్వో శిరీష పాల్గొన్నారు.