ఖమ్మం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తెల్లవారుజామునే మంగళవాయిద్యాల నడుమ ఆలయాల తలుపులు తెరిచి స్వామివారికి పంచామృతాలతో సర్వాంగాభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం స్వామివారికి పట్టువస్త్రాలతో అలంకరణ చేశారు. వెంకటేశ్వర స్వామి వారికి మహిళా భక్తులు పొంగళ్లు చేసి స్వామివారికి నివేదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉప్పల కృష్ణమోహనశర్మ, ఈవో జగన్మోహన్రావు, సూపరిండెంట్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కే.విజయకుమారి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.