కొత్తగూడెం టౌన్/ సత్తుపల్లి టౌన్/భద్రాచలం, జనవరి 10: రైల్వేశాఖ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తుందని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అన్నారు. బుధవారం ఉదయం ఆయన ప్రత్యేక రైలులో సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ సెక్షన్కు చేరుకున్నారు. రైల్వే శాఖ అధికారులు సూచనలు సలహాలిచ్చారు. తొలుత భద్రాచలంలోని రామచంద్రస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మణుగూరు రైల్వే స్టేషన్, చండ్రుగొండ రైల్వేస్టేషన్లను సందర్శించారు. అనంతరం సత్తుపల్లి చేరుకుని సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని జేవీఆర్ ఓసీ కోల్హ్యాండ్లింగ్ ప్లాంట్ను పరిశీలించారు. రైల్వే సైడింగ్ను తనిఖీ చేశారు.
రైళ్ల ద్వారా జరుగుతున్న బొగ్గు రవాణాపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత సికింద్రాబాద్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిందన్న విషయం తెలుసుకుని కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వేస్టేషన్ను సందర్శించకుండానే సికింద్రాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. సౌత్ సెంట్రల్ జీఎం వెంట సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భర్తేశ్కుమార్, సీనియర్ డీవోఎం సురేశ్రెడ్డి, బీడీసీఆర్ ఏవో రజనీష్మీనా, సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజు ఉన్నారు.