కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 1: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోనే సుమారు 250కి పైగా ఉన్న ప్రభుత్వ, ప్రై వేట్ థర్మల్ కేంద్రాల కన్నా అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ను సాధించి ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్ నాటికి అత్యుత్తమ విద్యుత్ కేంద్రంగా రికార్డు సృ ష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్తో ముగిసిన 8 నెలల కాలంలో అత్యుత్తమ సగటు పీ ఎల్ఎఫ్ 90.86 శాతంతో ఈ ఘనతను సాధించిం ది. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ శ్రీధర్ హర్షం ప్ర కటిస్తూ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
సిం గరేణి థర్మల్ కేందం ప్రారంభించి ఆరేండ్లే అయినప్పటికీ మొదటి నుంచి పీఎల్ఎఫ్తో దేశంలోని 25 అత్యుత్తమ ప్లాంట్ల జాబితాలో అగ్ర స్థానాల్లో ని లుస్తూ వస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న విద్యుత్ కేంద్రాల్లో అత్యుత్తమంగా 88.97 శాతం పీఎల్ఎఫ్తో మొదటి స్థానంలో నిలవగా అదే విభాగంలో 2020-21లో రెండో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో కెల్లా మొదటి స్థానం లో నిలవగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గల ఎన్టీపీసీ కోర్బా సూపర్ థర్మల్ స్టేషన్ 90.01 శాతం పీఎల్ఎఫ్తో రెండో స్థానంలో నిలిచింది.
ఎన్టీపీసీకి చెందిన సిం గ్రోలి ప్లాంట్ 89.94 శాతం పీఎల్ఎఫ్తో 3వ స్థా నంలో నిలిచింది. ఎస్టీపీపీ నాలుగు సార్లు వంద శాతం పీఎల్ఎఫ్ సాధించింది. 2018 సెప్టెంబర్, 2019 ఫిబ్రవరి, 2020 ఫిబ్రవరి, 2022 మార్చిలో నూటికి పైగా పీఎల్ఎఫ్ సాధించడం విశేషం. ఈ ప్లాంట్లో రెండు యూనిట్లు ఉండగా, రెండో యూ నిట్ ఇప్పటివరకు 10 సార్లు, 1వ యూనిట్ ఏడుసార్లు వంద శాతం పీఎల్ఎఫ్ దాటడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సింగరేణి థర్మల్ కేంద్రం దోహద పడుతున్నది. ఇప్పటివరకు 51.547 మిలియన్ యూనిట్ల విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేసి తనవంతు పాత్రను పోషిస్తున్నది.
రాష్ట్రంలో సో లార్ ప్లాంట్ల ఏర్పాటులో ముందడుగు వేసిన తొలి ప్రభుత్వ సంస్థ సింగరేణి. ఇప్పటికి 219 మెగావాట్ల ప్లాంట్లను విజయవంతం గా నెలకొల్పింది. మూడో విడుత 81 మెగావాట్ల ప్లాం ట్ల ఏర్పాటులో భాగం గా త్వరలోనే సింగరేణి ప్లాంట్ ఆవరణలోని నీటి రిజర్వాయర్లో 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నది. 2026 నాటికి 3వేల మెగావాట్లకు పైగా విద్యుత్ను అందించేందుకు సిం గరేణి సంస్థ ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోందని సీఎండీ శ్రీధర్ తెలిపారు. జాతీయ స్థాయిలో సింగరేణి థర్మల్ ప్లాంట్ మొదటి స్థా నంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.