సింగరేణి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి బొగ్గు ఉత్పత్తి సాధించే దిశగా ముందుకు సాగుతున్నది. సంస్థ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి సాధించే విధంగా అడుగులు వేస్తున్నది. కొన్నేండ్లుగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాటేందుకు తీవ్ర కృషి చేస్తున్నప్పటికీ అనేక అవంతరాలతో అది సాధ్యం కావడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. మరో 11 రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో రికార్డు స్థాయిలో 67మిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి సాధించేలా కనిపిస్తున్నది. సీఎండీ , డైరెక్టర్ల నిత్య పర్యవేక్షణ జీఎంలు, అధికారులు, ఉద్యోగుల సమష్టి కారణంగా నల్ల నేల వ్యాప్తంగా అనుకున్న స్థాయిలో ఉత్పత్తి సాధ్యమవుతున్నది. కాగా, ఉత్సత్తితో పాటు ఈ ఏడాది సంస్థ లాభాలు కూడా మరింత రెట్టింపయ్యే అవకాశం కనిపిస్తున్నది.
– గోదావరిఖని, మార్చి 19
సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి బొ గ్గు ఉత్పత్తి దిశగా ముందుకు సాగుతున్నది. మరో 11 రోజు ల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 67మిలియన్ టన్నులకు పై గా బొగ్గు ఉత్పత్తి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సం స్థలో 2021-22లో అత్యధికంగా 65.02మిలియన్ టన్ను ల ఉత్పత్తి సాధ్యమైంది. 2020-21లో కరోనా కారణంగా కేవలం 50.58 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీసింది. కా గా, 2018-19లో 64.40మిలియన్ టన్నులు, 2019-20లో 64.02 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించింది. ఈ నాలుగేండ్లుగా సంస్థ అంతర్గతంగా 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించేందుకు కృషి చేస్తున్నా, ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇది సాధ్యం కాలేదు. గతంలో ఎన్నడూ లేని వి ధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం 67మిలియన్ ట న్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి సాధించి, సరికొత్త రికార్డు దిశగా ముందుకు సాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు ముగిసిన 11నెలల 15 రోజుల కాలానికి సంస్థలో 63.41 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధ్యమైంది. మార్చి నెలలో కేవలం 15 రోజుల వ్యవధిలోనే సంస్థలో 32,91,389 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. అంటే రోజుకు దాదాపు 2.2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం రికార్డుగా మారింది. ఈనెల 15న 2,34,434 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం విశేషం.
ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 11 రోజులే మిగిలి ఉండటంతో మిగతా లక్ష్యాన్ని సునాయాసంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా ఏరియాలు నిర్దేశిత లక్ష్యాలు పూర్తి చేసుకున్నాయి. ఆర్జీ-1 ఏరియా ముందుగానే టార్గెట్ ను దాటింది. సంస్థ వ్యాప్తంగా ఇప్పటికే 3 ఏరియాల్లో వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించడం శుభపరిణామం గా మారింది. మార్చి 15 నాటికి రామగుండం డివిజన్-1 వా ర్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 37,14,954కు గాను 43,25, 412 టన్నులు (116శాతం), ఇల్లందు డివిజన్లో 43,39, 840 టన్నులకు 46,55,212 టన్నులు (107 శాతం), మ ణుగూరులో 1,10,09,308 టన్నులకు 1,16,45,000 టన్నులు (106శాతం) సాధించింది. ఈ డివిజన్లకు తోడుగా శ్రీరాంపూర్, ఆర్జీ-2 డివిజన్లు నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకున్నా యి. రానున్న రోజుల్లో మిగతా ఏరియాల్లో కూడా లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యాజమాన్యం మొదటి నుంచి చెబుతూ వస్తున్న విధంగా రోజుకు 2 లక్షలకు పైగా బొగ్గు ఉత్పత్తి సాధించాలనే నిర్ణయానికి అనుగుణగా చివరి నెలలో బొగ్గు ఉత్పత్తి సాధించడంపై సంతోషం వ్యక్తమవుతున్నది. ఇటు 67 మిలియన్ టన్నుల మార్క్ను దాటడమే కాకుండా, సింగరేణి చరిత్రలోనే మరోసారి భారీ లాభాలను ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ ఆర్జించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.