కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 29: బొగ్గు ఉత్పాదన, రవాణాలో సింగరేణి సంస్థ బుధవారం సరికొత్త రికార్డులు సృష్టించింది. ఉదయం షిఫ్ట్ నుంచి మొదలు రాత్రి షిఫ్ట్ మధ్య ఉన్న 24 గంటల వ్యవధిలో ఉద్యోగులు, కార్మికులు 2.46 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 2.53 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో సరికొత్త రికార్డును నెలకొల్పి ఇదే నెల 20న నోమోదైన 2.24 లక్షల టన్నుల బొగ్గు బొగ్గు ఉత్పత్తి, 2.35 లక్షల టన్నుల రవాణా రికార్డును తిరగరాసింది. ఈ సందర్భంగా సీఎండీ శ్రీధర్ అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
ఇదే ఉత్సాహంతో 700 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలన్నారు. మిగిలిన 90 రోజుల్లో కనీసం 2.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆదేశించగా బుధవారం అన్ని ఏరియాలు కలిపి ఈ లక్ష్యాన్ని దాటాయన్నారు. మణుగూరు ఏరియా తన వంతుగా 64 వేల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి సంస్థ పరిధిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కొత్తగూడెం ఏరియా 51 వేల టన్నులతో రెండోస్థానంలో నిలిచిందన్నారు.
సారపాక, డిసెంబర్ర్ 29: సింగరేణి మణుగూరు ఏరియా బొగ్గు రవాణాలో గతేడాది రికార్డ్ను బద్దలు కొట్టినట్లు ఏరియా జీఎం జి.వెంకటేశ్వరరెడ్డి అన్నా రు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో గురువారం ఆయ న మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏరియా నుంచి 64,534 టన్నుల బొగ్గు రవాణా చేశామన్నారు. ఇది గతేడాది కంటే ఎక్కువ అని అన్నారు. అనంతరం ఉద్యోగులు, సూపర్వైజర్లు, యూనియన్ ప్రతినిధులు, డిపా ర్ట్మెంటల్ ఉద్యోగులను జీఎం అభినందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు సాధించాలన్నారు.
– సింగరేణి మణుగూరు ఏరియా జీఎం