ఖమ్మం: ఖమ్మం నగరంలోని మమత దంత వైద్యశాలలో ఈ నెల 3,4,5తేదీల్లో జాతీయ స్థాయిలో దంత వైద్యంపై సెమినార్ జరుగనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ వినయ్రెడ్డి, మమత దంత కళాశాల డీన్ అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీ.వెంకటేశ్వరరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ బాగం కిషన్రావు తెలిపారు. బుధవారం మమ దంత కళాశాల ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో సెమినార్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇండియన్ అసోసియేషన్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ ఆధ్వర్యంలో జరిగే 32వ జాతీయ స్థాయి సెమినార్కు అన్ని రాష్ట్రాల నుంచి 700లకు పైగా డెలిగేట్స్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
దంత వైద్యంలో నోటికి సంబంధించిన అనేక రకాల వ్యాధులను రేడియాలజీ ద్వారా గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటుపలు అంశాలపై ఈ సెమినార్ లో చర్చించనున్నారు. విప్లవాత్మకమైన మార్పులు వస్తున్న వైద్యరంగంలో టెక్నాలజీ సాయంతో అనేక శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరుగుతోందన్నారు. తొలిరోజైన 3వ తేదీన రీసెర్చ్, సైంటిఫిక్ పేపర్ ప్రెజెంటేషన్, 4వ తేదీనన సెమినార్ ప్రారంభోత్సవం, నూతన కార్యవర్గం ఎన్నిక, 5వ తేదీన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే నిష్ణాతులైన వైద్యుల ప్రసంగం ఉంటుందన్నారు. దంత వైద్య విద్యార్ధులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.