కల్లూరు, అక్టోబర్ 1: నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఎస్సీ కుటుంబానికీ ‘దళితబంధు’ పథకాన్ని వర్తింపజేస్తామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నియోజకవర్గానికి దళితబంధును ప్రకటించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. నియోజకవర్గానికి దళితబంధు మంజూరైన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కల్లూరు మండలంలో ఆదివారం నిర్వహించిన సంబురాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు.
అనంతరం మండలంలోని చిన్నకోరుకొండి గ్రామంలో రూ.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో ఎమ్మెల్యే సండ్ర పర్యటించడంతో గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సొసైటీ చైర్మన్ చావా వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ కట్టా అజయ్కుమార్, ఎంపీపీ బీరవల్లి రఘు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ..
సత్తుపల్లి నియోజకవర్గానికి దళితబంధు కావాలని మంత్రి కేటీఆర్ను తాను కోరానని, అందుకు ఆయన అంగీకరించి సత్తుపల్లి సభలో ప్రకటన చేశారని అన్నారు. ఆ తరువాత సీఎం కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నప్పటికీ గంట వ్యవధిలోనే జీవోను జారీచేయించారని అన్నారు. సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉం టామని అన్నారు. అనంతరం చెన్నూరు గ్రామంలో గ్రామస్తులు బతుకమ్మలతో, పూలతో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. చిన్నకోరుకొండిలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలకు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే సండ్ర క్షీరాభిషేకం చేశారు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చెక్కులను, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ ఎన్నికల్లో తనకు అధిక మెజార్టీ అందించాలని కోరారు.
బీఆర్ఎస్లోకి 15 కుటుంబాలు..
మండలంలోని చెన్నూరు గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, సొసైటీ చైర్మన్ పాలెపు రామారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్, టీడీపీ నుంచి 15 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బీరవల్లి రఘు, కట్టా అజయ్బాబు, నామా రాధమ్మ, ఉప్పు సుబ్బారావు, ఇస్మాయిల్, బోబోలు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.