కల్లూరు, అక్టోబర్ 5: అంగన్వాడీలు, ఆశా కార్యకర్తల కుటుంబాల్లో వెలుగులు నింపింది సీఎం కేసీఆరేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల కంటే అధికంగా వేతనాలు అందిస్తూ గౌరవిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. కల్లూరు మండలంలో గురువారం పర్యటించిన ఆయన.. ఎన్నెస్పీ ప్రాజెక్టు ఆవరణలో రూ.50 లక్షలతో చేపట్టిన ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఖాన్ఖాన్పేట, అంబేద్కర్నగర్, రామానగర్, గోపాలకుంట, బోడిమెళ్ల, పుల్లయ్యబంజర గ్రామాల్లో వేణుగోపాలస్వామి దేవాలయం, షాదీఖానా, సొసైటీ భవన నిర్మాణాలకు శంకుస్థాపనల పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీలకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇవ్వడం లేదని అన్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వమే అంగన్వాడీలను ఆదుకుంటోందని అన్నారు. అలాంటి తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. అలాగే, నియోజకవర్గం మొత్తానికి దళితబంధును వర్తింపజేస్తున్న సీఎం కేసీఆర్కు మనమంతా రుణపడి ఉంటామని అన్నారు. అనంతరం డీసీసీబీ గోదామును ప్రారంభించారు. కాగా, ఆయా గ్రామాల్లో అక్కడి ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
తరువాత సొసైటీ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ చీరెలు, ఇళ్ల స్థలాల పట్టాలు, డబుల్ బెడ్ రూం ఇళ్ల పట్టాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, స్పోర్ట్స్ కిట్లు, టీ షర్టులు పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, అశోక్చక్రవర్తి, రామానుజం, బాబ్జీప్రసాద్, రవిప్రసాద్, టీ.సుమ, కృష్ణకుమారి, కట్టా అజయ్బాబు, పాలెపు రామారావు, లక్కినేని నీరజ, లక్కినేని రఘు, బోబోలు లక్ష్మణరావు, కొరకొప్పు ప్రసాద్, సింగిసాల ప్రసాద్, గంగవరపు వెంకటేశ్వరరావు, రావి సూర్యనారాయణ, ఇస్మాయిల్, కాటంనేని వెంకటేశ్వరరావు, పెడకంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.