జూలూరుపాడు, మార్చి 12: స్నేహపూర్వక వాతావరణంలో సంతోషంగా జీవిస్తున్న గ్రామాల్లో విద్వేషాలను రొచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న మతోన్మాద బీజేపీని తరమికొట్టాలని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పిలుపునిచ్చారు. స్త్రీలను పూజించే మన దేశంలో బీజేపీ నాయకులు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వారి సాంస్కార హీనానికి నిదర్శనమని విమర్శించారు. మండలంలోని జడలచింత నుంచి కొత్తూరు మీదుగా రాజారావుపేట క్రాస్ రోడ్డు వరకు రూ.1.40 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, మాచినేనిపేట తండా నుంచి బాడవబోడు వరకు రూ.1.10 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం మాచినేనిపేటతండా సబ్స్టేషన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో 16 మందికి మంజూరైన రూ.5.40 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొలాలకు వెళ్లే డొంక రోడ్ల నిర్మాణానికి నిధుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్కి నివేదిక అందించామని, త్వరలోనే నిధులు మంజూరవుతాయని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు కళావతి, ప్రసాద్, రోజా, రాములు, శాంతిలాల్, రాందాస్, కిషన్లాల్, నీల, గిరిబాబు, నర్సింహారావు, సతీశ్కుమార్, వీరభద్రం, నర్సింహారావు, రాంబాబు, నాగేశ్వరరావు, కిరణ్, దేవీలాల్, రామకృష్ణ, చిన్నా, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.