లక్ష్మీదేవిపల్లి/కొత్తగూడెం అర్బన్/ తిరుమలాయపాలెం/ టేకులపల్లి/ చుంచుపల్లి/ చర్ల/ మణుగూరు టౌన్/ ఇల్లెందు రూరల్/ కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 23: వన దేవతల ఆగమనంతో అడవితల్లి పులకించింది. సమ్మక్క- సారక్క శరణు ఘోషతో వనం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. బంగారం (బెల్లం) సమర్పణ, ఊరే గింపులు, భక్తుల పూనకా లతో హోరెత్తింది. అచ్చమైన ఆదివాసీ పూ జలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పునీతమైంది. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని ఎదురు గుట్ట సమ్మక్క సారక్క సుంకు జాతరకు శుక్ర వారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. జిల్లా నుం చే కాక ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచీ భారీ గా భక్తులు తర లొచ్చారు. గణాచారులు సమ్మక్క-సా రక్కను తిరిగి గుట్టకు చేర్చడంతో జాతర ముగిసింది. చుంచుపల్లి మండలం గౌతంపూర్ పంచాయతీ పరిధి లోని ఎర్రగడ్డ మినీ మేడారానికి భక్తులు భారీగా తరలొ చ్చారు. డప్పు వాద్యాలు, గిరిజన పూజారుల పూనకాల నడుమ గురువారం రాత్రి నిర్వాహకులు అమ్మవార్లను వనం నుంచి గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు.
గద్దెలపై కొలువైన వన దేవతలను శుక్రవారం భక్తులు దర్శించుకుని మొ క్కులు తీర్చుకున్నారు. టేకులపల్లి మండల కేంద్రంతోపాటు పాలమడుగు, నర్సాయిగూడెం, మురుట్ల, రామ చంద్రునిపేట, లక్ష్మీదేవిపల్లి మండలం లోని గడ్డిగుట్టలోనూ గ్రామస్తులు వన దేవతలకు పూజలు చేశారు. ఇల్లెందు మండలంలోని బొజ్జాయి గూడెంలోని సమ్మక్క- సారక్క గద్దెల వద్ద గ్రామస్తులు మొక్కులు తీర్చు కున్నారు. మణుగూరు మండలం తోగ్గూడెం, కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని రామాటాకీస్ ఏరియాలో సమ్మక్క-సారక్క జాతరలకు పట్ట ణవా సులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఖమ్మం జిల్లా తిరు మలాయపాలెం మండలం కాకరవాయి మినీ మేడారానికి జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ నుంచీ వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు గ్రామస్తులు అన్నదానం చేశారు.