ఎల్బీనగర్, జూలై 27 : తుపాకీతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఓ యువకుడిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు.. సరూర్నగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. సరూర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం కథనం ప్రకారం .. సరూర్నగర్ శంకర్ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఇమ్రాన్ అలియాస్ ఇబ్బు (22) సరూర్నగర్ భగత్సింగ్నగర్లోని బస్తీ దవాఖాన వెనుక ప్రాంతంలో ఓ కంట్రీమేడ్ రివాల్వర్తో పాటుగా ఓ లైవ్ రౌండ్తో స్థానికులను బెదిరిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సరూర్నగర్ పోలీసులతో కలిసి మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
చెడు సవాసాలకు అలవాటుపడిన ఇమ్రాన్ .. చోరీలబాట పట్టాడు. గతంలో ఇతడిపై వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 17 కేసులు నమోదై ఉన్నాయి. గత ఏడాది రాజేంద్రనగర్లోని ఓ స్క్రాప్ షాపులో పనిచేసే సమయంలో బిహార్కు చెందిన షకీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి.. అతడి ద్వారా రూ.40 వేలకు ఓ కంట్రీమేడ్ రివాల్వర్, ఓ రౌండ్ బుల్లెట్లను కొనుగోలు చేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం భగత్సింగ్నగర్ ప్రాంతంలో తుపాకీతో హల్చల్ చేస్తూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.