ఖమ్మం : రైతును ఆర్థికంగా బలోపేతం చేసి రాజును చేయడమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డీ లక్ష్మీప్రసన్న తెలిపారు. రైతుబంధు వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఖమ్మంలోని ఇల్లందుక్రాస్రోడ్ రైతుబజార్లో ఘనంగా వారోత్సవాలను రైతులు జరుపుకున్నారు. ఈ సందర్బంగా రైతుబజార్ కేంద్రాన్ని అందంగా తీర్చిదిద్దుకొని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో రైతుబంధు చిత్రపటాలను రూపొందించారు. ఈ వేడుకలకు చైర్పర్సన్ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వ్యక్తిగత సహాయకుడు చిరుమామిళ్ల కిరణ్కుమార్తో కలిసి హాజరయ్యారు.
రైతులతో కలిసి వారు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయా మండలాలకు చెందిన ఉద్యాన పంటల సాగు రైతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కే వెంకటేశ్వర్లు, జిల్లా మార్కెటింగ్శాఖ అధికారి కోలహాలం నాగరాజు, రైతుబజార్ ఎస్టేట్ అధికారి పద్మావతితో పాటు ఉద్యానపంటల సాగు రైతులు తదితరులు పాల్గొన్నారు.