ఖమ్మం :తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు బంధు సంబురాల నిర్వాహణ భేష్ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కితాబిచ్చారు. ఈ నెల4వ తేదీ నుంచి నగర వ్యవసాయ మార్కెట్ కమిటీ తరపున చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, సాయికిరణ్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
మిర్చిమార్కెట్, పత్తిమార్కెట్, అపరాల యార్డులతో పాటు, రెండు రైతుబజారుల్లో సైతం రైతులు, వ్యాపారులు, కార్మికులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి చేసిన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. సోమవారం హోల్సేల్ కూరగాయల మార్కెట్లో జరిగిన వేడులకు హాజరైన మంత్రి ఈ సందర్బంగా వారోత్సవాల కార్యక్రమాలను ప్రస్తావించారు. ఎంతో గొప్పగా, విజయవంతంగా చేయడంలో క్రియాశీలకంగా వ్యవహారించిన చైర్పర్సన్ దంపతులను అభినందించారు.