మామిళ్లగూడెం, సెప్టెంబర్ 27: సమాచార హకు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని సమాచార హకు చట్టం రాష్ట్ర కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్నాయక్ పేర్కొన్నారు. సమాచార హకు చట్టం (ఆర్టీఐ)లో వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న 30 కేసుల విచారణను ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో బుధవారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం కోసం ఆర్టీఐ ఎంతో దోహదపడుతోందని అన్నారు. ప్రజలు కోరిన సమాచారాన్ని సంబంధిత అధికారులు 30 రోజుల్లోపు అందించాలని సూచించారు.
అలా ఇవ్వని అంశాలపై ప్రజలు, పౌర సమాచార అధికారులతో ఖమ్మంలో కమిషన్ కోర్టు నిర్వహించామని, పలు కేసులను విచారించి దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని అందించాలని ఆదేశించామని అన్నారు. పౌర సమాచార అధికారులు సకాలంలో సమాచారం ఇవ్వకుంటే చట్టం ప్రకారం అప్పీలేట్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 459 పైచిలుకు కేసులు పరిషరించామన్నారు. రాష్ట్ర స్థాయిలో 38 వేల కేసుల్లో 30 వేల పైచిలుకు కేసులను పరిషరించినట్లు వివరించారు. సమాచార హకు చట్టంపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతకుముందు అదనపు కలెక్టర్, డీఆర్వో, ఆర్డీవో, తహసీల్దార్లు, ఇతర అధికారులు ఆర్టీఐ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.