సత్తుపల్లి టౌన్, మే 17 : సత్తుపల్లి ప్రాంతంలో బొగ్గు గనుల నుంచి లారీలకు లోడింగ్ పెంచాలని ఎంపీ నామా నాగేశ్వరరావుకు సత్తుపల్లి లారీ అసోసియేషన్ అధ్యక్షుడు జ్యేష్ట లక్ష్మణరావు, సభ్యులతో కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ప్రస్తుతం లారీ లోడింగ్ యజమానులకు సక్రమంగా అందించడం లేదని, లారీ యజమానులు ఫైనాన్స్ వారికి కిస్తీలు కట్టే పరిస్థితి ఉండడం లేదని ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎంపీ నామా తక్షణమే సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సర్వేశ్వరరావు, పలువురు అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.