కారేపల్లి, మార్చి 17 : కారేపల్లి మండల కేంద్రంలో గల కారేపల్లి జామే మస్జిద్ కు మృతి చెందిన రైల్వే ఉద్యోగి షేక్ సర్దార్ జ్ఞాపకార్థం రూ.60 వేల విలువ గల ఏసీ, రిఫ్రిజిరేటర్ను వితరణగా అందజేశారు. సర్దార్ కుమారులు షేక్ సద్దాం, ఆజం, ఇతర కుటుంబ సభ్యుల చేతుల మీదుగా మంగళవారం మసీదులో ముస్లిం పెద్దలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జామే మస్జిద్ అధ్యక్షుడు షేక్ మునీరుద్దీన్ పటేల్, ఉపాధ్యక్షులు షేక్ షఫీ, షేక్అబ్దుల్ మతిన్, యాకుబ్ పాషా, షేక్ జహీర్, షేక్ జావీద్, మొహమ్మద్ రెహమాన్, ఫిరోజ్ (బూది), షేక్ రియాజ్, షేక్ జాఫర్, మహబూబ్ పాషా, షేక్ యాకుబ్, ఇస్మాయిల్, అతీక్ పాల్గొన్నారు.