ఎర్రుపాలెం: మండల పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామసమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యాన్ని జిల్లా సివిల్సప్లై అధికారులు పట్టుకున్నారు. జిల్లా సివిల్ సప్లై అధికారి బీ.రాజేందర్ మాట్లాడుతూ అక్రమంగా రేషన్బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి సోమవారం అర్థరాత్రి సమయంలో తక్కెళ్లపాడు గ్రామసమీపంలో రెండు బోలెరో వాహనాలు, ఒక టాటా ఏసీ వాహనం, ఒక ప్యాసింజర్ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న సుమారు70 క్వింటాళ్ల రేషన్బియ్యాన్ని వెంబడించి పట్టుకున్నామని తెలిపారు. పట్టుకున్న వాహనాలను, రేషన్బియ్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి స్థానిక ఎర్రుపాలెం పోలీస్స్టేషన్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.