ఖమ్మం సిటీ, మార్చి 6 : నిలువ నీడ కోల్పోయి ఇంటి సామాన్లను కాపాడుకుంటూ ఖమ్మం టీటీడీసీ, అంబేద్కర్ భవన్లో ఆశ్రయం పొందుతున్న భూదాన్ నిర్వాసితులకు ‘పువ్వాడ ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండుపూటల భోజన సౌకర్యం కల్పించారు. అంతేకాక ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు.
అన్నదాన కార్యక్రమంలో మమత సంస్థల డైరెక్టర్ పువ్వాడ నరేన్రాజ్, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి, షకీనా, ఆరెంపుల వీరభద్రం, వీరేందర్గౌడ్, వెంకట్, ఉస్మాన్, తోడేటి లింగరాజు, తీగల సతీష్గౌడ్, తిరుమల్, రాంబాబు, కొంపెల్లి నాగరాజు, మిర్యాల రమేశ్, కోలేరు బుజ్జి, నరేశ్, అఫ్రోజ్, సత్తి గోపాలరావు, భరత్చంద్ర, దయాకర్, ఫ్రాన్సిస్ పాల్గొన్నారు.