ఖమ్మం, నవంబర్ 13: ఇకడ నేను మంత్రిగా ఉండి కేసీఆర్, కేటీఆర్ సహకారంతో ఖమ్మంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే.. ఎమ్మెల్యే పదవిలో కూడా లేని తుమ్మల ఇవన్నీ తాను ఎలా చేశాడో.. అర్ధం కావట్లేదని మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ ఎద్దేవా చేశారు. తుమ్మల ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలీదు.. హైదరాబాద్లో ఉంటాడో.. ఖమ్మంలో ఉంటాడో.. గండుగులపల్లి పోతాడో.. ఎవరికీ తెలియదని, ఎవరు స్థానికంగా ఉంటారో.. ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలని అన్నారు. సోమవారం నగరంలోని 43, 44, 51, 52వ డివిజన్లల్లో నిర్వహించిన రోడ్ షోలో అజయ్కుమార్ మాట్లాడారు. డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, టౌన్ ప్రెసిడెంట్ పగడాల నాగరాజు, కార్పొరేటర్లు పాలెపు విజయ వెంకటరమణ, బుర్రి వెంకట్కుమార్, శీలంశెట్టి రమా, దోరేపల్లి రవికుమార్, జకుల లక్ష్మయ్య, బుర్రి వినయ్ కుమార్, అమరగాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఖమ్మం, నవంబర్ 13: బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక రూ.400కే గ్యాస్, రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం ఇవ్వనున్నామని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అజయ్కుమార్ అన్నారు. ఎన్నికల్లో ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని 9వ డివిజన్ నందు ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్కుమార్ రోడ్ షో నిర్వహించారు. రోటరీ నగర్లోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పువ్వాడ పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్ కొత్తపల్లి నీరజ, డివిజన్ అధ్యక్షుడు పాషా, టౌన్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, సరిపుడి సతీశ్, వల్లభనేని రామారావు, మారగాని సుదర్శన్, జాబిశెట్టి శ్రీనివాస్, వంగవీటి శ్రీనివాసరావు, షకీల్ పాషా, చారి, కౌశిక్, షేక్ షకీన, సాధిక్ తదితరులు ఉన్నారు.
ఖమ్మం, నవంబర్ 13: నగరంలోని 57వ డివిజన్లో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అజయ్కుమార్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్ధించారు. డివిజన్లోని టిఫిన్ సెంటర్లో నిర్వాహకురాలితో కలిసి ఇడ్లీ, పూరీలు వేసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఖమ్మం, నవంబర్ 13: ఖమ్మం నగరం 10వ డివిజన్లో సోమవారం సాయంత్రం ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ రోడ్ షో నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున జై తెలంగాణ.. జై అజయ్ అన్నా.. అంటూ నినాదాలు చేశారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి నీచమైన రాజకీయాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారని, దమ్ముంటే ధర్మ పోరాటం చేయాలని హితవు పలికారు.
ఖమ్మం,నవంబర్ 13: సీపీఐ ఖమ్మం జిల్లా నాయకురాలు, ఏఐటీయూసీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శింగు నర్సింహారావు సతీమణి సుశీల మృతికి మంత్రి, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్కుమార్ సంతాపం తెలిపారు. సోమవారం ఖమ్మం రాపర్తి నగర్లోని ఆమె నివాసానికి వెళ్లి సుశీల భౌతిఖాయన్ని సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆమె భర్త నర్సింహారావు, కుమారులు శ్రీధర్, మురళీధర్ను ఓదార్చారు.