జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం అయ్యింది. పాల్వంచ మండలం శేఖరం బంజరం పీహెచ్సీలో పల్స్పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రియాకం ఆల ప్రారంభించారు. అంగవైకల్యాన్ని జయించేది రెండు పోలియో చుక్కలేనని కలెక్టర్ అన్నారు. తన పిల్లలిద్దరికీ ఆమె స్వయంగా పోలియో చుక్కలు వేశారు.
జిల్లావ్యాప్తంగా జీరో నుంచి ఐదేండ్లలోపు పిల్లలను 98,358 మందిని గుర్తించామని, వారికి 925 కేంద్రాల్లో తొలిరోజు 94,270 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆది నారాయణ, కోరం కనకయ్య పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియోరహిత సమాజం కోసం మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
– నెట్వర్క్