‘డబుల్’ లబ్ధిదారుల వద్దకెళ్లిన బీజేపీ నేతలకు చేదు అనుభవం
వారిపై తిరగబడిన డబుల్ ఇండ్ల లబ్ధిదారులు
‘డౌన్ డౌన్ బీజేపీ.. గో బ్యాక్ బీజేపీ..’ అంటూ నినాదాలు
తెలంగాణ ప్రభుత్వంలోనే గూడు దొరికిందన్న కాలనీవాసులు
డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంపై ఖమ్మంలో బీజేపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారి కుటిల బుద్ధిని గ్రహించిన లబ్ధిదారులు తిరగబడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచే సుకున్నది. ఖమ్మం టేకులపల్లిలో తెలంగాణ సర్కారు నిర్మించి ఇచ్చిన 1200 డబుల్ బెడ్ రూం ఇండ్లకు లబ్ధిదా రులు ‘కేసీఆర్ టవర్స్’గా నామకరణం చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు బుధ వారం ఆ ఇళ్ల వద్దకు వెళ్లారు. అక్కడ నివసించే మహిళలను కలిసి.. ‘మీకు ఇళ్లు ఎలా వచ్చాయి? ఎంతకు కొనుగోలు చేశారు? ఎవరికి డబ్బులు కట్టారు? ఎంత కట్టారు?’ అంటూ అడిగారు. దీంతో డబుల్ బెడ్ రూం ఇండ్ల వాసులు బీజేపీ నేతలపై తిరగబడ్డారు. కేసీఆర్ టవర్స్ ప్రాంగణాన్ని వీడి వెంటనే వెళ్లిపోండి.’ అంటూ హెచ్చరించారు. బీజేపీ నేతలు వాదించే ప్రయత్నం చేయగా.. డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీవాసులంతా వారిని చుట్టుము ట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఊరుకో బోమంటూ హెచ్చరించారు.
రఘునాథపాలెం, జూలై 6: తప్పు ఎక్కడ జరిగితే.. అక్కడే ప్రశ్నించాలి. అప్పుడే దానికి పరిష్కారం దొరుకుతుంది. కనీసం ఈ విషయం ఖమ్మం బీజేపీ నేతలకు తెలియకపాయె. పుండు ఒక్కచోట ఉంటే.. మందు మరోచోట రాసే ప్రయత్నం చేసి ‘ఛీ..’ అనిపించుకున్నారు. ఖమ్మంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ ఎవరో డబ్బులు వసూలు చేసిన ఘటనను బీజేపీ నేతలు భుజానికెత్తుకున్నారు. ఖమ్మంలోని టేకులపల్లి వద్ద ఉన్న కేసీఆర్ టవర్స్ ప్రాంగణంలోకి వెళ్లి డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల చేత గెంటి వేయించుకున్నారు. బుధవారం ఖమ్మంలో బీజేపీ నేతలు వ్యవహరించిన తీరును చూసి జిల్లా ప్రజలు చీదరించుకున్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ తెలంగాణ సర్కారు డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. నిర్మాణాలు పూర్తయిన చోట అధికారులు పారదర్శకంగా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను గుర్తించారు. బహిరంగ సమావేశం నిర్వహించి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. ఈ ప్రక్రియను ప్రజలంతా హర్షిస్తున్నారు. కానీ ఎవరో చేసి తప్పును బీజేపీ నేతలు అందిపుచ్చుకొని కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా వ్యవహరిస్తున్నారు.
నీచపు ఆలోచనతో ‘కేసీఆర్ టవర్స్’లోకి..
ఖమ్మంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ ఎవరో చేసిన తప్పు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రమూ సంబంధం లేని విషయం. పారదర్శక ప్రక్రియతో నిరుపేదలకే టేకులపల్లి ‘కేసీఆర్ టవర్స్’లో ఇళ్లు లభించాయి. అయినా తెలంగాణ సర్కారును బద్నాం చేసేందుకు, మంత్రి అజయ్పై బురద జల్లేందుకు ఖమ్మం బీజేపీ నేతలు పూనుకున్నారు. బుధవారం కేసీఆర్ టవర్స్లోకి ప్రవేశించిన బీజేపీ నాయకులు.. అక్కడ నివసించే మహిళలను కలిశారు. ‘మీకు ఇళ్లు ఎలా వచ్చాయి? ఎంతకు కొనుగోలు చేశారు? ఎవరికి డబ్బులు కట్టారు? ఎంత కట్టారు?’ అంటూ అడిగారు. తాము ఎవ్వరికీ డబ్బులు ఇవ్వలేదని, తమకు సొంత ఇల్లు లేనందునే అధికారులు గుర్తించి ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వమే తమకు గూడు కల్పించిందని వివరించారు. వారి సమాధానానికి సంతృప్తి చెందని బీజేపీ నేతలు.. ‘లేదు లేదు.. ఖమ్మంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం పెద్ద ఎత్తున డబ్బులు వసూళ్లు జరిగాయి. రెండురోజులుగా బాధితులు న్యాయం కోసం పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు.’ అంటూ బీజేపీ నాయకులు వాదన మొదలు పెట్టారు. వారి అసలు బుద్ధిని గ్రహించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నివాసులు వారిపై తిరగబడే ప్రయత్నం చేశారు. మహిళలు అంతా ఒక్కటయ్యారు. ‘మీ కుటిల నీతి మాకు అర్థమైంది. కేసీఆర్ టవర్స్ ప్రాంగణాన్ని వీడి వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.’ అంటూ హెచ్చరించారు. అయినా బీజేపీ నేతలు వాదించే ప్రయత్నం చేయగా డబుల్ బెడ్ రూం ఇళ్ల కాలనీవాసులంతా వారిని చుట్టుముట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు. తప్పుడు ఆలోచనతో కేసీఆర్ టవర్స్లోకి అడుగు పెడితే తగిన బుద్ధి చెబుతామంటూ స్పష్టం చేశారు. కాషాయ పార్టీ నాయకుల కారు చుట్టుముట్టి.. ‘బీజేపీ డౌన్ డౌన్.. బీజేపీ నేతల్లారా గో బ్యాక్..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో చేసేదేమీ లేక బీజేపీ నేతలు తలలు వంచుకొని తిరుగుపయనమయ్యారు.
టీఆర్ఎస్ హయాంలోనే గూడు దొరికింది..
మా వద్ద అధికారులు ఒక్కపైసా తీసుకోలేదు. పారదర్శకంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ జరిగింది. గత ప్రభుత్వాలు నిరుపేదల కోసం ఏమీ చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మాకు గూడు లభించింది. బీజేపీ నాయకులు మంత్రి పువ్వాడ అజయ్కుమార్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి కేసీఆర్ టవర్స్ వద్దకు వస్తే కాషాయ నేతలకు తగిన బుద్ధి చెప్తాం.
– మహ్మద్, డబుల్ బెడ్రూం లబ్ధిదారుడు, టేకులపల్లి
కుట్రలు చేస్తే సహించం..
కేసీఆర్ టవర్స్లో మేము ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఇక్కడ బీజేపీ నేతలు కుట్రలు చేయాలనుకుంటే ఊరుకోం. ఎన్నో ఏళ్లుగా మేం కిరాయి ఇళ్లల్లో ఉండి అవస్థలుపడ్డాం. ప్రభుత్వం మమ్మల్ని పేదలుగా గుర్తించి డబుల్ బెడ్రూం ఇండ్లు అందించింది. తెలంగాణ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగింది. బీజేపీ నేతలు ఎక్కడి నుంచో వచ్చి కాలనీలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి కుట్రలను తిప్పికొడతాం.
– కె.అనూష, డబుల్ బెడ్రూం లబ్ధిదారురాలు, టేకులపల్లి