కారేపల్లి,ఫిబ్రవరి 26 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని దుబ్బతండా గ్రామానికి చెందిన భూక్య శ్రీనివాసరావు ఇటీవల గుండెపోటుతో అకాల మృతి చెందాడు. కూలీ పని చేసుకుని జీవించే శ్రీనివాసరావుకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. దుబ్బతండా గ్రామంలో గురువారం శ్రీనివాసరావు సంతాప సభను కుటుంబ సభ్యులు నిర్వహించారు.
శ్రీనివాసరావు తో పాటు కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలిసి విద్యను అభ్యసించిన మిత్రులు బానోత్ బాబు రూ.5000, బానోత్ కుమార్ రూ.1500లతో పాటు మిగతా మిత్రులు తమకు తోచినంత ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతకుముందు మిత్రుడు శ్రీనివాసరావు చిత్రపటానికి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో తోటి మిత్రులు శివాజీ, భావుసింగ్ వీరన్న, కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.