రఘునాథపాలెం, ఫిబ్రవరి 3: జిల్లాకు మంజూరైన వైద్య కళాశాలను పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ కార్యాలయాల స్థానాల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బీ.వెంకటేశ్వర్లుతో కలిసి వైద్య కళాశాల ఏర్పాటుకు భవనాలు, సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య కళాశాల ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.
బాలురు, బాలికలకు హాస్టళ్ల కోసం విడివిడిగా భవనాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్రావు, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, టీఎస్ ఎంఎస్ఐడీసీ ఈఈ ఉమామహేశ్వరరావు, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.