ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 11 : దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు మెరిశారు. ఆదివారం వెలువడిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలు ర్యాంక్లతో సత్తా చాటినట్లు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి.
న్యూవిజన్ దుందుభి
అడ్వాన్స్డ్ జేఈఈ ఫలితాల్లో న్యూవిజన్ కళాశాల విద్యార్థులు ఓపెన్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించి మరోసారి తమదైన ముద్ర కొనసాగించారని చైర్మన్ చుంచు గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. వివిధ కేటగిరిలో వెయ్యిలోపు ర్యాంక్లు సాధించిన 29 మంది న్యూవిజన్ విద్యార్థులేనన్నారు. ఓపెన్ కేటగిరిలో కే వైభవ్ చౌదరి-272, శ్రీదుర్గ-1,778, సాయి అమృత వర్షిణి-1,897, నాగభువిత్-3,483, పవన్ సిద్దార్ధ-4,329, లోహితశ్రీ- 4,659, శ్రీరామ్-4,678వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు. ఎస్టీ కేటగిరిలో 4వ ర్యాంక్ వచ్చిందన్నారు. కళాశాల నుంచి ఐఐటీలో 18, ఎన్ఐటీలో 41, ఎంబీబీఎస్లో 30మంది విద్యార్థులను ప్రతి సంవత్సరం చేర్చుతున్నట్లు తెలిపారు. ర్యాంక్లు సాధించిన విద్యార్థులు, సహకరించిన తల్లిదండ్రులను విద్యాసంస్థల డైరెక్టర్ సీహెచ్ గోపిచంద్, అకడమిక్ డైరెక్టర్ సీహెచ్ కార్తీక్, కళాశాల ప్రిన్సిపాల్ బ్రహ్మచారి, శ్రీనివాసరావు అభినందించారు.
శ్రీచైతన్య విజయకేతనం
అడ్వాన్స్డ్ జేఈఈ ఫలితాల్లో జాతీయస్థాయి ర్యాంక్లతో విజయకేతనం ఎగురవేసినట్లు శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య తెలిపారు. కళాశాలకు చెందిన నరేందర్-8వ ర్యాంక్, వర్షిత్-139, పావనీ ప్రియ-144, ఈశ్వర్సాయి గణేశ్-193, రవీందర్-229, మధు-263, చంద్రప్రకాశ్-359, గాయత్రి-364, లచ్చిరామ్-399, అక్షిత-429, వినీల-478, జుబితశ్రీ-483వ ర్యాంక్ సాధించారు. వివిధ కేటగిరిలో 500లోపు 12, వెయ్యిలోపు 23, 2వేల లోపు 42ర్యాంక్లు, 5వేల లోపు 56 ర్యాంక్లు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను అకడమిక్ డైరెక్టర్ సాయిగీతిక, డీజీఎం చేతన్మాధుర్, డీన్ వర్మ, ఏజీఎంలు అభినందించారు.
కృష్ణవేణి విజయభేరి
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కృష్ణవేణి కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్లు సాధించి విజయకేతనం ఎగురవేసినట్లు విద్యాసంస్థల అధిపతి యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. కళాశాలకు చెందిన వెంకటరమణ-34, శేషికుమార్-149, ప్రవల్లిక-356, లోకేశ్-534, రాహుల్-695, హేమంత్-805, వంశీ-1095, విష్ణువరుణ్-1,292, అఖిల్సాయి-1,357, మౌనిశ్రీ-2,253, హేమంత్కుమార్-2,380వ ర్యాంక్ సాధించారు. నిరంతర కృషి, ఆధునిక విద్యావిధానంతో బోధన, విద్యార్థుల సహకారం, తల్లిదండ్రుల తోడ్పాటు ప్రధాన కారణమన్నారు. విద్యార్థులు, అధ్యాపకులను డైరెక్టర్స్ గొల్లపూడి జగదీశ్, మాచవరపు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రామచందర్రావు, అధ్యాపకులు అభినందించారు.
హార్వెస్ట్ విజయం
అడ్వాన్స్డ్ జేఈఈ ఫలితాల్లో హార్వెస్ట్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంక్లు సాధించినట్లు కరస్పాండెంట్ పోపూరి రవిమారుత్ తెలిపారు. కళాశాలకు చెందిన ధనుంజయ్-436, ఆదర్శ్-540, వెంకట నాగవర్షిత్-3,822, సాత్విక్-3,598, ఉజ్వలసాయి రాహుల్-7,737 ర్యాంక్ సాధించారు. అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం సమష్టి కృషితో సత్తా చాటినట్లు పేర్కొన్నారు. ఫలితాల కృషి వెనుక శ్రమించిన అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులను ప్రిన్సిపాల్ రామసహాయం పార్వతిరెడ్డి అభినందించారు.
రెజోనెన్స్ ప్రభజనం
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంక్లు సాధించినట్లు కళాశాల డైరెక్టర్స్ రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్ తెలిపారు. కళాశాలకు చెందిన మహేందర్-108, సాయికుమార్-558, రుత్విక-670, సిషిరో-735, ప్రణయ్-773, సాహిత్య-1,096, వినోద్-1,174, సుప్రజ-3306వ ర్యాంక్ సాధించి జిల్లా కీర్తిని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపినట్లు తెలిపారు. సంస్థ స్థాపించిన నాటినుంచి క్రమం తప్పకుండా విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయిలో పోటీ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. విద్యార్థులు, అధ్యాపకులను డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్ సతీశ్, భాస్కర్రెడ్డి, శాంతి అభినందించారు.